Wednesday, May 15, 2024

తెలంగాణ‌లో మ‌స్త్ జోష్‌.. పెళ్లి చేసుకోనీకి 90వేల మంది రెడీ

ప్రభన్యూస్: కరోనా కారణంగా రెండేళ్లుగా శుభ కార్యాలు నిర్వహించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. పైగా ఇప్పుడు చైత్ర, వైశాఖ మాసాల్లో ముహుర్తాలు కూడ బాగున్నాయి. శ్రీరామనవమి తర్వాత నుంచి వచ్చేనెల 25వ వరకు బలమైన ముహుర్తాలు ఉండటంతో అందరు తమ ఇంట వివాహాలను ఘనంగా జరిపించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్‌ , మేలలో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 90వేల వివాహా వేడుకలు జరుగనున్నాయని తెలుస్తుంది. ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే సుమారు 35 వేళ పెళ్లిళ్ల వరకు జరుగనున్నట్లు పురోహితులు, ఫంక్షన్‌ హాల్‌ ప్రతినిధులు వివరిస్తున్నారు. మరోవైపు పంక్షన్‌ హాల్‌కు డిమాండే ఏర్పాటు అవకాశాలు కనిపిస్తుండటంతో ఇప్పటి నుంచే వాటిని బుక్‌ చేసుకునేందుకు బారులు తీరున్నారు. నగరంలోని కొన్ని ఫంక్షన్‌ హళ్ల ప్రతినిధులు ఉదయం పెళ్లి సాయంత్రం రిసెప్షన్‌కు బుకింగ్‌ తీసుకుంటున్నారు. అటు గ్రామీణ ప్రాంతాల్లోని ఫంక్షన్‌ హాళ్లకు ఏప్రిల్‌కు సంబందించిన బుకింగ్‌లు మార్చిరెండో వారంలోనే పూర్తయ్యాయి.

అంతేకాకుండా నగరంలోని పలు హోటళ్లలో గదులు కూడ బుకింగ్‌ అయిపోతున్నాయి. సొంతూళ్ల నుంచి వచ్చే బంధువులకు ఇళ్లలో అతిథ్యం ఇవ్వడం కష్టంగా మారిన ఈ రోజుల్లో హోటల్‌ గదులు అయితే సౌలభ్యంగా ఉంటాయని ముందస్తుగా వాటిని కూడ బుక్‌ చేసేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ వస్తుండటంతో ఇప్పటికే శుభలేఖలు అచ్చు వేఇ ప్రింటింగ్‌ ప్రెస్‌ లు, వస్త్ర దుకాణాలు సందడిగా కనిపిస్తున్నాయి. అటు పోటోగ్రాఫర్‌ లు, విడియోగ్రాఫర్లు , పురోహితులు,మేకప్‌, బంగారు వ్యాపారులు , ఇళ్లను విద్యుద్దీపాలతో ఆలంకరించే వారు , క్యాటరింగ్‌ సహా దాదాపు 20 రంగాలకు చెందిన వారుచేతి నిండా పనితో బిజి అయిపోయారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement