Thursday, May 2, 2024

అమెరికాలో కాల్పుల మోత.. యువకుడు మృతి

వాషింగ్టన్‌ : ప్ర‌పంచ పెద్ద‌న్న‌, అగ్రరాజ్యం అమెరికాలో తుపాకుల మోత మోగుతోంది. వాష్టింగన్‌ డీసీలోని 14వ, యూస్ట్రీట్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. యూ స్ట్రీట్‌ నార్త్‌వెస్ట్‌లో కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. కాల్పుల నేపథ్యంలో ఆ ప్రాంతం వైపుగా ఎవరూ వెళ్లొద్దని సూచించారు. అయితే, కాల్పులకు కారణాలు తెలియరాలేదు. ఇటీవల కాలంలో అమెరికాలో వరుసగా కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అగ్రరాజ్యంలో వరుసగా జరుతున్న కాల్పుల ఘటనలతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement