Saturday, May 4, 2024

తమిళనాడులో భారీ పేలుడు.. నలుగురు మృతి

ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించగా… నలుగురు మృతిచెంద‌గా, మ‌రికొంద‌రు గాయ‌ప‌డిన విషాద ఘ‌ట‌న తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. విరుధు న‌గ‌ర్ జిల్లాలో పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు సంఘ‌ట‌న‌ జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కకడే మృతి చెందినట్లు సమాచారం. ఘటన సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 15 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో నలుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక అధికారులు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి కారణం తెలియరాలేదు.

ఇదిలా ఉండ‌గా… బాణాసంచా కర్మాగారాల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. శనివారం విరుధునగర్ జిల్లా శివకాశిలో బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటనను మరువకముందే.. ఈరోజు మరో ఘటన చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement