Sunday, May 19, 2024

మొహర్రం కు భారీ ఏర్పాట్లు.. అధికారులను ఆదేశించిన మంత్రి కొప్పుల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మొహర్రం వేడుకలును ప్రతిసంవత్సరం మాదిరిగానే ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధికారులను ఆదేశించారు. మొహర్రం ఏర్పాట్లపై సోమవారం సచివాలంయలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈసమావేశంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ తోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మొహర్రం వేడుకలకు భారీ ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు.

సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ప్రతి పండుగను ప్రభుత్వ పరంగా భక్తి భావంతో జరుపుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు అహ్మద్‌ బాషా ఖాద్రి, మైనారిటీ శాఖ సలహాదారు ఎకె ఖాన్‌, రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ మహమ్మద్‌ సలీం, మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్‌నదీం, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ. ఆనంద్‌ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement