Friday, May 3, 2024

Follow up : నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నాడు నష్టాల్లో ముగిశాయి. ఉదయం ప్లాట్‌గా ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు, కొద్ది సేపటికే నష్టాల్లోకి వెళ్లాయి. చివరి అరగంటలో అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. గత వారం సూచీలు 12 నెలల గరిష్టానికి చేరడంతో స్టాక్స్‌లో మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. రూపాయి బలహీన పడడం కూడా మార్కెట్లను దెబ్బతీసింది.

సెన్సెక్స్‌ 170.89 పాయింట్ల నష్టంతో 61624.15 వద్ద ముగిసింది. నిఫ్టీ 20.55 పాయింట్ల నష్టంతో 18329.15 వద్ద ముగిసింది.

బంగారం 10 గ్రాముల ధర 322 రూపాయలు పెరిగి 52656 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 697 రూపాయలు పెరిగి 62268 వద్ద ట్రేడయ్యింది.

డాలర్‌తో రూపాయి మారకం విలువ 81.23 రూపాయలుగా ఉంది.

- Advertisement -

లాభపడిన షేర్లు

కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, మారుతి సుజుకీ, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అదానీ ఎంటర్‌ప్రైజ్‌, దివిస్‌ ల్యాబ్‌ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు

డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, ఐటీసీ, ఎస్‌బీఐ, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌, విప్రో, ఎంఅండ్‌ఎం, భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement