Saturday, May 4, 2024

Follow up | నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఊగిసలాట మధ్య ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు కొద్ది సేపటికే నష్టాల్లోకి వెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి.
సెన్సెక్స్‌ 30లో కేవలం 9 షేర్లు మాత్రమే లాభపడ్డాయి. తీవ్రనష్టాల్లో సాగుతున్న అదానీ షేర్లకు కొంత ఉపసశమనం లభించింది. ముందస్తుగా రుణాలు చెల్లిస్తామన్న ప్రకటనతో అదానీ గ్రూప్‌ షేర్లు లాభాల్లో ముగిశాయ.

సెన్సెక్స్‌ 220.86 పాయింట్ల నష్టంతో 60286.04 వద్ద ముగిసింది. నిఫ్టీ 43.10 పాయింట్ల నష్టంతో 17721.50 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 127 రూపాయలు పెరిగి 57082 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 32 రూపాయలు పెరిగి 67431 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.49 రూపాయిలుగా ఉంది.

- Advertisement -

లాభపడిన షేర్లు

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫౖౖెనాన్స్‌, ఎల్‌ అండ్‌ టీ, ఎస్‌బీఐ, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఆటో, ఐచర్‌ మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సిప్లా, కోల్‌ ఇండియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, అదానీ పోర్ట్స్‌, ఓఎన్‌జీసీ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు

టాటా స్టీల్‌, ఐటీసీ, సన్‌ఫార్మా, మారుతీ సుజుకీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టాటా మోటార్స్‌, విప్రో, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎం అండ్‌ ఎం, ఇన్ఫోసిస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టైటాన్‌ కంపెనీ, ఎన్‌టీపీసీ, టెక్‌ మహీంద్రా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బీపీసీఎల్‌, దివిస్‌ ల్యాబ్స్‌, అపోలో ఆస్పటల్స్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement