Monday, April 29, 2024

Follow up | మార్కెట్ల బుల్‌ రన్‌.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు

స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నాడు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే జోరును కొనసాగించాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. బ్యాంకింగ్‌, ఐటీ షేర్లు రాణించడంతో సూచీలు గణనీయంగా లాభపడ్డాయి. హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణం రెండు సంవత్సరాల కనిష్టానికి తగ్గడం మార్కెట్లకు కలిసొచ్చింది. సెన్సెక్స్‌ 600.42 పాయింట్ల లాభంతో 61032 వద్ద ముగిసింది. నిఫ్టీ 158.95 పాయింట్ల లాభంతో 17929.85 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 204 రూపాయలు పెరిగి 56701 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 201 రూపాయలు తగ్గి 65943 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.46 రూపాయలుగా ఉంది.

- Advertisement -

లాభాపడిన షేర్లు..

ఐటీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, ఎం అండ్‌ ఎం, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, టీసీఎస్‌, టాటా స్టీల్‌, నెస్లే ఇండియా, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, దివిస్‌ ల్యాబ్‌, సిప్లా, డాక్టర్‌ రెడ్డీ ల్యాబ్స్‌, ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు..

ఎన్‌టీపీసీ, సన్‌ ఫార్మా, ఎల్‌ అండ్‌ టీ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టైటాన్‌ కంపెనీ, ఏషియన్‌ పెయింట్స్‌, మారుతీ సుజుకీ, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, హీరో మోటోకార్ప్‌, బీపీసీఎల్‌, అపోలో ఆస్పటల్స్‌, బజాజ్‌ ఆటో షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement