ఎబోలాను పోలిన ప్రమాదకర వైరస్ మార్బర్గ్ బారిన పడి ఇద్దరు మృతి చెందినట్లు ఆదివారం ఘనా ప్రభుత్వం ధృవీకరించింది. ఈనెల మొదటి వారంలో ఘనాలో మరణించిన ఇద్దరు వ్యక్తులకు ఆరోగ్యశాఖ అధికారులు టెస్టులు నిర్వహించగా, వారికి మార్బర్గ్ పాజిటివ్గా నిర్థారణ జరిగింది. దీంతో అప్రమత్తమైన ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు మార్బర్గ్ వైరస్ కూడా ఎబోలా వైరస్లా చాలా ప్రమాదకరమైందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకటించారు. ఘనాలో కొత్త వైరస్ మార్బర్గ్ పాజిటివ్ నమోదైనట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.
- Advertisement -