Friday, May 3, 2024

ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మందా జగన్నాథం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మందా జగన్నాథం నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మందా జగన్నాథంకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.

గతంలో సీనియర్ నేత వేణుగోపాలాచారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు. ఆయన పదవీకాలం పూర్తయిన తర్వాత చాలా కాలంగా ప్రత్యేక ప్రతినిధి పోస్ట్ ఖాళీగా ఉంది. గతంలోనూ మందా జగన్నాథం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement