Thursday, April 25, 2024

నందిగ్రామ్‌లో స్వల్ప మెజారిటీతో మమత గెలుపు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో ఆసక్తి రేకెత్తించిన నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీ గెలుపొందారు. రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం చేతులు మారగా.. చివరకు బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై 1200 ఓట్ల మెజారిటీతో మమత విజయం సాధించారు. దీంతో మమతా బెంగాల్ బెబ్బులి అంటూ ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బెంగాల్ పులికి అభినందనలు అంటూ ఇప్పటికే పలువురు జాతీయ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా మమతా బెనర్జీకి అభినందనలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement