Saturday, May 4, 2024

పెగాసస్ పై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే బాగుంటుంది: మమతా బెనర్జీ

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీతో భేటీ అయిన సంగతి తెలిసిందే… ప్రధానితో తాను మర్యాదపూర్వకంగానే సమావేశమయ్యానని చెప్పారు దీదీ. రాష్ట్రానికి మరిన్ని కరోనా వ్యాక్సిన్ డోసులు అవసరమని ప్రధానిని కోరానని తెలిపారు. పశ్చిమబెంగాల్ పేరు మార్పు అంశాన్ని లేవననెత్తానని చెప్పారు. పేరు మార్పు అంశాన్ని పరిశీలిస్తానని ఆయన అన్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన పెగాసస్ అంశంపై ప్రధాని అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే బాగుంటుందని చెప్పారు. ఈ కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని అన్నారు. మరోవైపు పెగాసన్ అంశంపై ఇప్పటికే మమతా బెనర్జీ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. పెగాసస్ వ్యవహారంలో మోదీ మౌనంగా ఉన్నారని… అందుకే తాము విచారణ కమిషన్ ను ఏర్పాటు చేశామని ఆ సందర్భంగా ఆమె చెప్పారు.

ఇది కూడా చదవండి: పీఎం పదవిపై కన్నేసిన దావూద్ గర్ల్ ఫ్రెండ్..

Advertisement

తాజా వార్తలు

Advertisement