Saturday, April 20, 2024

కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ బదిలీ.. అందుకేనా..?

కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. సుమారు ఐదేళ్లుగా కరీంనగర్ పోలీస్‌ కమిషనర్‌గా పనిచేస్తుండటంతో ఆయన్ని బదిలీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో లాంగ్ స్టాండింగ్ అధికారులను ఉంచకూడదని నిబంధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కమలాసన్‌‌రెడ్డిని కరీంనగర్ సీపీగా రిలీవ్ చేసి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. మరోవైపు సత్యనారాయణ స్థానంలో రామగుండం సీపీగా ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ఎం.రమణకు పోస్టింగ్ ఇచ్చారు. ఆయన ప్రస్తుతం నాన్ కేడర్ ఎస్పీగా ఉన్నారు. ఆయన స్థానంలో ప్రస్తుతం రామగుండం సీపీగా ఉన్న సత్యనారాయణను కరీంనగర్‌ పోలీస్ కమిషనర్‌గా నియమించింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఇది కూడా చదవండి : పీఎం పదవిపై కన్నేసిన దావూద్ గర్ల్ ఫ్రెండ్..

Advertisement

తాజా వార్తలు

Advertisement