Tuesday, May 7, 2024

పాలెం ప్రాజెక్టు ప్రధాన కాలువకు గండి..

నూగూరు వెంకటాపురం, ప్రభన్యూస్‌: మండలంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆదివారం పాలెం ప్రాజెక్టు ప్రధాన కాలువకు చిన గంగారం గ్రామ సమీపంలో గండి పడింది. వర్షపు నీరు కాల్వలో ఎక్కువగా రావటంతో వరద తాకిడికి ప్రధాన కాల్వకు గండి పడింది.

దీనితో వరద నీరు పంట పొలాల్లోకి వెళ్లాయి. ప్రాజెక్టు ప్రధాన కాల్వ క్రింద రైతులు వరి పంటను సాగుచేసుకుంటున్నారు. కాగా ప్రాజెక్టు ప్రధాన కాల్వకు గండి పడటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు కాల్వకు త్వరతిగతిన మరమ్మత్తులు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement