ప్రముఖ దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా వాహన ధరలు పెంచింది. తమ వాహన ధరలు 2.5శాతం మేరకు పెంచామని కంపెనీ గురువారం ఎక్స్ఛేంజ్లకు తెలిపింది. గురువారం నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయని వెల్లడించింది. వాహనం మోడల్, వేరియంట్నుబట్టి ఎక్స్ షోరూం ధరలు రూ.10వేల నుంచి రూ.63వేల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
వాహనాల తయారీకి ఉపయోగించే స్టీల్, అల్యూమినియం తదితర ముడి సరుకుల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ వెల్లడించింది. పెరిగిన ముడిసరుకుల ప్రభావంతో ధరల సవరణ చేపట్టినట్లు తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..