Monday, April 29, 2024

నాలాల‌కు మ‌హ‌ర్ద‌శ‌ : మంత్రి త‌ల‌సాని

మ‌హా న‌గ‌రంలో నాలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఎస్‌ఎన్‌డీపీతో పూర్తిస్థాయిలో నాలాలను అభివృద్ధి చేస్తున్నామని ఆయ‌న తెలిపారు. సికింద్రాబాద్‌లోని పికెట్ నాలాపై రూ.10 కోట్లతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయ‌న పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్ల నుంచి ఎలాంటి అభివృద్ధికి నోచుకోని నాలాలను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ చొరవతో డెవలప్‌మెంట్‌ పనులు చేస్తున్నామన్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లో వరదముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement