Monday, April 29, 2024

Maharashtra – వ‌న‌గంగా న‌దిలో ప‌డ‌వ మున‌క …ఒక‌రి మృతి..ఐదుగురు గ‌ల్లంతు

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. అయితే ఆ పడవలో మొత్తం ఏడుగురు మహిళలు ప్రయాణిస్తున్నారు. అందులో ఒకరిని రక్షించారు. మరొకరు మృతి చెందగా, మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చమోర్షికి మిర్చి కోసేందుకు ఏడుగురు మహిళలు వెళ్తుండగా వనగంగా నదిలో ప్రమాదవశాత్తు బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో పడవ నడిపించే వ్యక్తి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, మహిళలు మునిగిపోయారు. అయితే.. స్థానిక ఈతగాళ్ల సహాయంతో రెస్క్యూ టీం గల్లంతైన మహిళల కోసం గాలిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement