Monday, April 29, 2024

Shirdiలో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోషియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర సమావేశం

షిర్డీలో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోషియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ప్రమోషన్ కోసం F-TAM అధ్యక్షుడు జగన్‌ బాబు గంజి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు . పలువురు తెలుగు సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగన్‌ బాబు గంజి సభ్యులందరికీ కమ్యూనిటీని నెట్‌వర్క్ చేయడానికి , అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి, పలు రంగాలలో ఒకరికొకరు సహాయం చేయడానికి అవసరమైన మార్గనిర్దేశం చేశారు.

ఇదే సమయంలో సభ్యులందరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగే పెద్ద కార్యక్రమాలకు ఎప్పటికప్పుడు అన్ని విధాలా సహకరిస్తామని వారంతా హామీ ఇచ్చారు . అనంతరం నెట్‌వర్క్‌ని నిర్మించడానికి , క్రమం తప్పకుండా కలుసుకోవాలని నిర్ణయించారు..

కాగా,రాంబాబు రెడ్డి, వరప్రసాద్ కావేరి, ఎం దుర్గారావు, నవీన్ రెడ్డి ,ఎస్వీఆర్ శ్రీనివాస్ లతో కో ఆర్డినేషన్ టీమ్ ఏర్పాటు చేశారు . ఈ సమావేశంలో మండవ రాజా, సతీష్, ధనేష్, అన్నవరం, అఖిల్, లక్ష్మణ్, రాజా తదితరులు పాల్గొన్నారు.

  1. చివరగా మండవరాజు వందన సమర్పణ చేస్తూ, సమావేశానికి హాజరైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు
Advertisement

తాజా వార్తలు

Advertisement