Thursday, April 25, 2024

రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య

ఇంట్లో పెద్ద‌లు ప్రేమ నిరాక‌రించార‌ని ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న క‌ర్నాట‌కలో చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. కర్నూలు జిల్లా పార్లపల్లె, కందవాతి గ్రామాలకు చెందిన ప్రేమ జంట గత కొంత కాలంగా లవ్ చేసుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం వారి ఇంట్లో తెలిసింది. వీరిద్దరి మధ్య వరస కుదరదని పెద్దలు పెళ్లికి నిరాకరించారు. దీంతో ఈ ప్రేమ జంట కర్ణాటకకు వలస వెళ్లి నివాసముంటుంది. శనివారం రాత్రి వీరిద్దరూ రాయచూరు జిల్లా యాదగిరి దగ్గర రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement