Monday, April 29, 2024

మార్చి 3న రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌కు సంబంధించి హైదరాబాద్‌ బండ్లగూడ(నాగోలు), పోచారం ప్రాంతాల్లో మిగిలిపోయిన త్రిబుల్‌ బెడ్‌రూమ్‌, డబుల్‌ బెడ్‌రూమ్‌, సింగిల్‌ బెడ్‌ రూమ్‌, సీనియర్‌ సిటిజన్‌ ఫ్లాట్ల కేటాయింపుల కోసం మార్చి 3వ తేదీన లాటరీ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ) తెలిపింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఫిబ్రవరి 15వ తేదీ వరకు టోకెన్‌ అడ్వాన్స్‌గా త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ కోసం రూ.3 లక్షలు, టూ బెడ్‌రూమ్‌ కోసం రూ.2 లక్షలు, 1 బెడ్‌రూమ్‌ కోసం లక్ష చొప్పున డిమాండ్‌ డ్రాఫ్ట్‌లు కట్టిన వారు లాటరీకి అర్హులని ప్రకటించింది. మార్చి 3వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి జరిగే లాటరీని పారదర్శకంగా దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షంగా తిలకించవచ్చని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement