Wednesday, March 27, 2024

ఐర్లాండ్ – ఇండియా మ్యాచ్ వ‌ర్షార్ఫ‌ణం…డ‌క్ లూయిస్ తో టీమ్ ఇండియా గెలుపు..

ద‌క్షిణాఫ్రికాలో జ‌రుగుతున్న మహిళల ప్రపంచకప్ లీగ్ పోటీలో భార‌త్ – ఐర్లాండ్ మ్యాచ్ వ‌ర్షార్ఫ‌ణం అయింది.. అయితే బెట‌ర్ ర‌న్ రేట్ ఆధారంగా డ‌క్ వ‌ర్డ్ లూయిస్ ప‌ద్ద‌తిలో భార‌త్ కు విజ‌యం ల‌భించింది.. ఈ విజ‌యంతో భార‌త్ ఈ టోర్ని సెమీస్ లోకి అడుగుపెట్టింది.. ముందుగా బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ధారిత 20 ఓవ‌ర్ల‌లో 155 ప‌రుగులు చేసింది.. అనంత‌రం 156 ప‌రుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన ఐర్లాండ్ 8.2 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 54 ప‌రుగులు చేసింది.. ఆ స‌మ‌యంలో వ‌ర్షం కుర‌వ‌డంతో మ్యాచ్ ర‌ద్దైంది.. డి ఎల్ ప‌ద్ద‌తిలో భార‌త్ కు అయిదు ప‌రుగుల తేడాతో విజ‌యం ల‌భించింది..

ఐర్లాండ్ తో కీలక మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధన విజృంభించింది. స్మృతి మంధన 56 బంతుల్లోనే 87 పరుగులు చేయడం విశేషం. ఆమె స్కోరులో 9 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. మరో ఎండ్ లో ఇతర బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయకపోవడంతో భారత్ కు భారీ స్కోరు సాధ్యం కాలేదు. మొత్తమ్మీద నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. యువ బ్యాటర్ షెఫాలీ వర్మ 24, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 13, జెమీమా రోడ్రిగ్స్ 19 పరుగులు చేశారు. రిచా ఘోష్, దీప్తి శర్మ డకౌట్ అయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో కెప్టెన్ లారా డెలానీ 3 వికెట్లు తీసింది. ఓర్లా ప్రెండెర్ గాస్ట్ 2, ఆర్లెన్ కెల్లీ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం, 156 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఐర్లాండ్ ను టీమిండియా ఆదిలోనే దెబ్బకొట్టింది. తొలుత ఓపెనర్ అమీ హంటర్ ను రనౌట్ రూపంలో తిప్పి పంపింది. ఆ తర్వాత, పేసర్ రేణుకా సింగ్ విజృంభించడంతో ఐర్లాండ్ వన్ డౌన్ బ్యాటర్ ఓర్లా ప్రెండెర్ గాస్ట్ డకౌట్ అయింది. దాంతో ఐర్లాండ్ 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంత‌రం గ్యాబీ లెవీస్ 32 ప‌రుగులు, లారా 17 ప‌రుగులు చేసి నాటౌట్ గా క్రీజ్ లో ఉన్నారు. 8.2 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 54 ప‌రుగులు మాత్రం చేసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement