Saturday, May 4, 2024

Lok Sabha : మూడు క్రిమినల్ చట్టాల సవరణ బిల్లులకు లోక్‌సభ ఆమోదం..

ఢిల్లీ: మూడు క్రిమినల్ చట్టాల సవరణ బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ), సాక్ష్యాల చట్టం (ఎవిడెన్స్‌ యాక్ట్‌) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భారతీయ న్యాయ (రెండో) సంహిత’, ‘భారతీయ నాగరిక్‌ సురక్షా (రెండో) సంహిత’, ‘భారతీయ సాక్ష్య (రెండో)’ బిల్లులకు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లులపై దిగువ సభలో చర్చ జరిగిన అనంతరం మూజువాణి ఓటుతో సభ్యులు ఆమోదం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement