Wednesday, May 1, 2024

Breaking: శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరడంతో మూడు గేట్లు ఎత్తారు. రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మంత్రి రాంబాబు 5,6,7 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. అలాగే కృష్ణ‌మ్మ‌కు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ప్రాజెక్టులో గరిష్ట నీటి నిల్వ 215.81 టీఎంసీలకు గాను ప్రస్తుతం 202.04 టీఎంసీలు ఉంది.ఇన్‌ఫ్లో 1,27, 980 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ ఫ్లో 74,365 క్యూసెక్కులు ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement