Friday, April 26, 2024

Leopard | ఊర పందిని తిని చిరుతపులి మృతి

నల్గొండ జిల్లా చందనపల్లి మున్సిపాలిటీ డంపింగ్ యార్డు సమీపంలో చిరుతపులి మృతి కలకలం రేపింది. బుధవారం ఉదయం డంపింగ్ యార్డ్ వద్ద చిరుతపులి కళేబరాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. వెంట‌నే అటవీ, పోలీసు శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. చిరుత కళేబరాన్ని పరిశీలించి కొద్దిరోజుల క్రితం మరణించినట్లుగా భావిస్తున్నారు. కొంత‌కాలంగా కేశరాజుపల్లి, శేషమ్మగూడెం, ఎస్టీ కాలనీ, చందనపల్లి గ్రామాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారులు సైతం చిరుత సంచారాన్ని గుర్తించారు. కాగా.. డంపింగ్‌ యార్డ్‌ పక్కన ఊర పందిని తినడంతో అది మరణించినట్లు అనుమానిస్తున్నారు. ఊర పందులను పట్టుకోవడానికి మందులు పెట్టినట్లు సందేహం వ్యక్తంచేశారు. చిరుత కళేబరాన్ని పోస్టుమార్టంతో పాటు ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement