Monday, May 6, 2024

హైకోర్టు న్యాయ‌వాది దంప‌తుల దారుణ హ‌త్య‌….

పెద్ద‌ప‌ల్లి – హైకోర్టు న్యాయవాది దంపతులను దుండగులు నరికి చంపారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచర్లలో చోటుచేసుకుంది. న్యాయవాది వామన్‌రావు, భార్య నాగమణి కారులో హైదరాబాద్‌ నుంచి మంథని వెళ్తున్నారు. కాగా వీరిని కలవచర్ల పెట్రోల్‌ పంపు ఎదుట అడ్డుకున్న దుండగులు కారులో ఉండగానే కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఇరువురిని చికిత్స నిమిత్తం పెద్దపల్లి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో దంపతులు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చెక్‌పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డీసీపీ రవీందర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement