Thursday, May 2, 2024

దేవునిపల్లిలో ఘనంగా లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవం.. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు

దేవునిపల్లిలో లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం పెద్దపల్లి జిల్లా దేవునిపల్లిలో రథోత్సవ కార్యక్రమం సందర్భంగా లక్షన్నరకు పైగా భక్తులు జాతరకు హాజరై స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు.

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో పాటు జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు దేవునిపల్లి జాతరకు హాజరయ్యారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా డీసీపీ రూపేష్, ఏసీపీ సారంగపాణి, సీఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు శ్రీనివాస్, శివాని, రాజేష్, మహేందర్ రాజ వర్ధన్, మౌనిక, శ్రీనివాస్, ఉపేందర్ తో పాటు సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement