Sunday, April 28, 2024

తండ్రే లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డితే ఎవ‌రితో చెప్పుకోవాలి…

నటి , క‌మ్ రాజ‌కీయ నాయ‌కురాలు కుష్బూ కూడా లైంగిక వేధింపుల బాధితురాలేన‌ట‌.. స్వ‌యంగా ఆమె వెల్ల‌డించింది. లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డింది త‌న తండ్రేనంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అయితే అప్పుడు తన వయసు ఎనిమిదేళ్లని, పదిహేనేళ్లు వచ్చాక తన తండ్రిని ఎదిరించానని చెప్పింది. దాంతో తన తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడని తెలిపింది. ముంబైలో ముస్లిం కుటుంబంలో జన్మించిన ఖుష్బూ చిన్ననాటి నుంచి నటనపై ఆసక్తిపెంచుకుంది. వినోద్‌ఖన్నా హీరోగా నటించిన ‘ద బర్నింగ్‌ ట్రైన్‌’ సినిమాతో తొలిసారి కెమెరా ముందుకు వచ్చింది. ఆ త‌ర్వాత ద‌క్షిణాదిలో స్థిర‌ప‌డి తెలుగు,త‌మిళ‌,క‌న్న‌డ‌, మ‌ల‌యాళం మూవీల‌లో న‌టించింది..క ఖుష్బూ తమిళ దర్శకుడు, నటుడు సి.సుందర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వివాహ అనంత‌రం కూడా మూవీల్లో న‌టిస్తూ రాజ‌కీయాల‌లో కొనసాగ‌తున్న‌ది.. త‌మిళ‌నాట బిజెపిలో కీల‌క‌నేతగా ఉన్న‌కుష్బూ ఇటీవ‌ల జాతీయ మ‌హిళా క‌మిష‌న్ లో స‌భ్యురాలిగా నియ‌మితుల‌య్యారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement