Wednesday, May 22, 2024

జాతీయ మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యురాలిగా కుష్బూ..

చెన్నై – సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ ను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కేంద్రం నియమించింది. ఆమెతోపాటు మమతా కుమారి, టెలీనా కంగ్ డోబ్ లను కూడా నియమిస్తూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వారు మూడేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు. దక్షిణాదిలో ఖుష్బూ వందకు పైగా తమిళ , తెలుగు సినిమాల్లో నటించారు. రాజకీయాలపై ఆసక్తితో 2010లో డీఎంకే పార్టీలో చేరారు. నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2020 వ‌ర‌కు కాంగ్రెస్ లో అధికార ప్రతినిధిగా సేవలందించారు. తర్వాత ఖుష్బూ బీజేపీలో చేరారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.. తాజాగా మహిళా క‌మిష‌న్ స‌భ్యురాలిగా నియ‌మితుల‌య్యారు..

cw
Advertisement

తాజా వార్తలు

Advertisement