Tuesday, October 22, 2024

మొక్క‌లు నాటిన కంగ‌నార‌నౌత్.. సంతోష్ కుమార్ పై ప్ర‌శంస‌లు

బాలీవుడ్ బ్యూటీ కంగ‌నార‌నౌత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్క‌లు నాటింది. శంషాబాద్ లోని పంచవటి పార్క్​లో కంగనా రనౌత్ మొక్కలు నాటారు. ప్రముఖ జ్యోతిష్యుడు బాలు మున్నంగి ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటినట్లు కంగనా తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా రాజ్యసభ ఎంపి సంతోష్ ​ కుమార్ కోట్లాది మొక్కలు నాటడం గొప్ప విషయం అని కొనియాడారు. ఈ ఛాలెంజ్ ను అందరూ స్వీకరించి మొక్కలు నాటాలని, పచ్చదనాన్ని పెంచాలని కంగనా కోరారు. అనంతరం తన సోదరి రంగోలి చందర్, డాక్టర్ రీతూ రనౌత్ , అంజలీ చౌహాన్​లకు కంగన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. వారు కూడా ఈ ఛాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటాలని కోరారు.రాజ్యసభ ఎంపీ సంతోశ్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా.. ఇలా అన్ని రంగాల ప్రముఖులు పాల్గొంటున్నారు. ఒకరికొకరు సవాల్ విసురుకుంటూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వ్యాపింపజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement