Sunday, May 5, 2024

శ‌ర్వానంద్​తో కృతిశెట్టి రొమాన్స్‌.. అస్సలు ఆగ‌డం లేదుగా..

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో డెబ్యూ చేసిన కృతిశెట్టి.. మొద‌టి సినిమాతోనే కావాల్సినంత క్రేజ్ ని సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. దీంతో వ‌రుస సినిమాల‌తో బిజీ అయిపోయిందీ అమ్మ‌డు. ఈ మ‌ధ్య కాలంలోనే రిలీజ్ అయిన శ్యామ్ సింగ రాయ్, బంగ‌ర్రాజు వంటి సినిమాలు బ్లాక్ బాస్ట‌ర్ కావ‌డంతో మ‌రిన్ని సినిమా చాన్సెస్ త‌న‌ను వెతుక్కుంటే వ‌చ్చేస్తున్నాయి. ప్ర‌స్తుతం హీరో సుధీర్ బాబుతో ‘‘మీకు చెప్పాలి’’ అనే సినిమా చేస్తోంది. అలాగే రామ్ పోతినేని.. ‘వారియ‌ర్’ సినిమాలోనూ కృతిశెట్టి హీరోయిన్ గా న‌టిస్తుంది.

కాగా, తాజాగా మ‌రో సినిమాకు కృతిశెట్టి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. శ‌ర్వ‌నంద్ హీరోగా ఇటీవ‌ల వ‌చ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా థియేట‌ర్ల‌లో సందిడి చేస్తోంది. ఈ సినిమా త‌ర్వ‌త శ‌ర్వ‌నంద్.. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు.. అయితే ఈ సినిమాలో శర్వాతో రొమాన్స్​ చేయడానికి కృతిశెట్టి రెడీ అయ్యిందట. తన అందంతో పాటు అభినయంతో కుర్ర‌కారును ఆక‌ట్టుకుంటుంది. అందుకని వ‌రుస‌గా సినిమా అవ‌కాశాలు వస్తున్నాయని ఫిలింనగర్​ వర్గాలు కోడై కూస్తున్నాయి..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement