Wednesday, May 1, 2024

కృష్ణమ్మకు తగ్గిన వరద..

శ్రీశైలం జలాశయానికి వరద క్రమంగా తగ్గుతోంది. నాలుగు గేట్లు ఎత్తి నాగార్జున సాగర్​కు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.60 అడుగులు ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 213.40 టీఎంసీల నీరు ఉంది . జలాశయానికి ఇన్ ఫ్లో లక్షా 69 వేలా 514 క్యూసెక్కులు వస్తుండగా… 2 లక్షలా 8 వేలా 787 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. 4 గేట్ల ద్వారా లక్షా 11 వేలా 564 క్యూసెక్కులు, ఎడమగట్టు నుంచి 33,549, కుడిగట్టు నుంచి 30,848 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు నుంచి 30,000, హంద్రీ నీవా నుంచి 2026, కల్వకుర్తి నుంచి 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ఇక, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్ట్ 8 గేట్లు ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‎ఫ్లో, అవుట్ ఫ్లో 1,07,462 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.60 అడుగులు ఉంది. సాగర్ పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుత నీటి నిల్వ 310.84 టీఎంసీలుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement