Tuesday, May 14, 2024

ఈ రోజే బీజేపీలో చేరుతున్నా – మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి ట్వీట్​

టిఆర్ ఎస్ లో ఉద్య‌మ‌కారుల‌కు ఏ మాత్రం విలువ లేద‌న్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి. కాగా నేడు ఆయ‌న బిజెపిలో చేరుతున్నట్లు ప్ర‌క‌టించారు. బీజేపీ నేతలతో సుదీర్ఘంగా జరిగిన చర్చల తర్వాత ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ విషయంపై స్వయంగా ట్విట్టర్ లో వివరాలు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న ‘విజయ సంకల్ప సభ’ సందర్భంగా బీజేపీలో చేరనున్నట్టు ప్రకటించారు. తాను చేసిన ట్విట్టర్ పోస్టులో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు ఉన్న చిత్రాన్ని కూడా పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement