Saturday, May 18, 2024

ప్రియాంక గాంధీతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ.. రాష్ట్ర పరిస్థితులు, పార్టీ వ్యవహారాలపై చర్చ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : టీమ్ వర్క్‌తో పని చేయాలని, ఏ సమస్య ఉన్నా తన దగ్గరకు రావాలని ప్రియాంక గాంధీ స్పష్టంగా చెప్పారని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం ఢిల్లీ వచ్చిన ఆయన సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రియాంక గాంధీని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో పార్టీని ఎలా పటిష్టం చేయాలనే అంశంపై ప్రియాంకతో చర్చించానని చెప్పారు. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో జరిగిన సమావేశానికి తమ కుటుంబంలో ఒక ఫంక్షన్ ఉన్న కారణంగా హాజరు కాలేకపోయానని ప్రియాంకకు వివరించానన్నారు.
తనకు ప్రత్యేకంగా సమయం ఇచ్చి చాలా విషయాలు సుదీర్ఘంగా చర్చించారని చెప్పారు. అంతసేపు జరిగిన చర్చలో తాను కొన్ని సలహాలు ఇచ్చానని అన్నారు. పది రోజుల పాటు తాను అందుబాటులో ఉండనని, వచ్చాక పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటానని వెల్లడించారు. భారత్ జోడో యాత్ర సహా రాష్ట్ర పరిస్థితుల గురించి ప్రియాంక గాంధీతో అర్థవంతమైన చర్చ జరిగిందని ఆయన వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement