Friday, May 3, 2024

సెన్సార్ ప‌నులు పూర్తి చేసుకున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం సినిమా.. శివ‌రాత్రికి రెడీగా #VBVK

యువ నటులు కిరణ్ అబ్బవరం లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా మూవీ ‘వినరో భాగ్యము విష్ణు కథ’. నూతన దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాశ్మీర పరదేశి కిర‌ణ్ కు జోడీగా క‌నిపించ‌నుంది. అయితే, తాజాగా ఈ సినిమా దాని సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ప్యానెల్ ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కోసం UA సర్టిఫికెట్ ను జారీ చేసింది.

ఇక‌.. ఈ సినిమా ఈ నెల (ఫిబ్రవరి) 18న మహా శివరాత్రి స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఫ్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇటీవలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ సినీ ప్రేమికులను చాలా బాగా ఆకట్టుకుంటోంది. ప్రీ రిలీజ్ బజ్ చాలా పాజిటివ్‌గా ఉంది. కాగా, ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో GA2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement