Tuesday, May 14, 2024

IPL | పంజాబ్ తో కీలక మ్యాచ్.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే!

ఐపీఎల్ 2023.. 16వ సీజ‌న్లో భాగంగా ఇవ్వాల రాత్రి పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్​ జరుగుతోంది. ఈ డూ ఆర్ డై మ్యాచ్ లో టాస్​ గెలిచిన రాజ‌స్థాన్ బౌలింగ్ ఎంచుకొగా., మెద‌ట‌ బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 ప‌రుగులు చేసింది. కాగా, ఈ మ్యాచ్ గెల‌వాలంటే రాజ‌స్థాన్ టీమ్ నిర్ణీత 120 బంతుల్లో 188 ప‌రుగులు చేయాల్సి ఉంది. కాగా, మ‌రికొద్ది సేప‌ట్లో రాజ‌స్థాన్ చేజింగ్ కు దిగ‌నుంది.

అయితే, పంజాబ్ టీమ్ లో అత్య‌ధికంగా సామ్ కర్రాన్ 31 బంతుల్లో 49 ప‌రుగులు (4-ఫోర్లు, 2-సిక్స్లు).., జితేష్ శర్మ 28 బంతుల్లో 44 ప‌రుగులు (3-ఫోర్లు, 3-సిక్స్లు).., షారుక్ ఖాన్ 23 బంతుల్లో 41 ప‌రుగులు (4-ఫోర్లు, 2-సిక్స్లు) చేశారు. ఇక‌ మిగిలిన వారు ఎవ్వ‌రూ అంత‌గా మెప్పించ‌లేక‌పోయారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement