Friday, May 3, 2024

కెసిఆర్ గాంధీ లో చేరాలి…. ప్రజలకు నమ్మకం కల్పించాలి !!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కేసీఆర్ కు కరోనా నిర్ధారణ అయిందని తెలిసినప్పటినుంచి తెరాస అభిమానులు సోషల్ మీడియా వేదికగా కెసిఆర్ కోలుకోవాలని ట్వీట్ లు ట్వీట్ లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరికొంతమంది నెటిజన్స్ కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్ గాంధీ కి వెళ్లాలని కోరుతున్నారు. గాంధీ లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లాల్సిన పని లేదని సీఎం కేసీఆర్ గతంలో చాలా సార్లు చెప్పారని… కానీ గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అతి దారుణంగా ఉన్నాయని అంటున్నారు.

సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది అమాయకులు బలైపోతున్నారని ఈ టైంలో కేసీఆర్ గాంధీ లో చేరితే ప్రజలకు ధైర్యం వస్తుందని చెబుతున్నారు. మరి కేసీఆర్ గాంధీ లో చేరుతారా అంటే ఛాన్స్ లేదని అంటున్నారు మరికొంత మంది నెటిజన్లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement