Saturday, April 27, 2024

Karnataka – లారీని ఢీకొన్న కారు… న‌లుగురు ఉద్యోగులు దుర్మ‌ర‌ణం

చిత్రదుర్గ: రహదారి పక్కన నిలిపి ఉంచిన ఓ లారీని వేగంగా వచ్చిన కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని వ్యక్తుల్లో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో మల్లపుర-గొలార్‌హట్టి రహదారికి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ప్రమాదం గురించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానికుల సాయంతో చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిత్రదుర్గ ఎస్పీ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement