Sunday, May 5, 2024

షర్మిలను రుద్రమదేవితో పోల్చిన కంచె ఐలయ్య

నిరుద్యోగుల విషయంలో వైఎస్ షర్మిల చేపట్టిన దీక్షకు ప్రముఖ సామాజికవేత్త, రచయిత కంచె ఐలయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణ‌య్యతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు మ‌ద్ద‌తు తెలిపారు. ఈ సంద‌ర్భంగా కంచె ఐల‌య్య మాట్లాడుతూ… కాకతీయ గడ్డపై రుద్రమదేవి తర్వాత మళ్లీ షర్మిలను చూస్తున్నానని ప్ర‌శంసించారు. సమ్మక్క-సారక్క వారసురాలు షర్మిల అని కొనియాడారు. తెలంగాణ మహిళా లోకం షర్మిలను ముఖ్యమంత్రిని చేస్తుందని ఐలయ్య వ్యాఖ్యానించారు. తెలంగాణ గడ్డపై రాజకీయ పార్టీ పెట్టే హక్కు ఆమెకు ఉంద‌ని చెప్పారు. వైఎస్ఆర్ హయాంలో 6వేల ఆంగ్ల మాధ్య‌మ పాఠ‌శాల‌లను ప్రారంభించారని తెలిపారు. పేదల చదువులకు వైఎస్ఆర్ ప్రాధాన్యత ఇచ్చార‌ని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement