Friday, April 26, 2024

ఈనెల 15 నుంచి పట్టాలెక్కనున్న విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్

విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలు మళ్లీ పట్టాలెక్కనుంది. ఈ నెల 15 నుంచి ఈ రైలు సేవలు మళ్లీ ప్రారంభం కానున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. ప్రయాణికుల నుంచి ఆదరణలేని కొన్ని రైళ్లను రైల్వే ఇటీవల రద్దు చేయగా, అందులో విశాఖపట్టణం-కాచిగూడ రైలు కూడా ఉంది. అయితే, ప్రస్తుతం మళ్లీ పరిస్థితులు కుదుటపడి ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో దానిని మళ్లీ పట్టాలెక్కిస్తోంది.

గురువారం సాయంత్రం 6:40 గంటలకు రైలు విశాఖలో బయలుదేరి శుక్రవారం ఉదయం 7:25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. 16న సాయంత్రం 6:25 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, మల్కాజిగిరిలలో ఆగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement