Sunday, April 28, 2024

కారులో 7 కిలోల బంగారం

కర్నూలు నగర శివార్లలోని పంచలింగాల చెక్ పోస్టు వద్ద భారీగా బంగారు ఆభరణాలను సెబ్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అక్రమంగా ఇన్నోవా కారులో ఎలాంటి అనుమతులు, బిల్లులు లేకుండా తరలిస్తుండగా స్పెషల్ ఎన్ఫోర్స్​మెంట్ బ్యూరో ఇన్స్​స్పెక్టర్ శ్రీనివాసులు పట్టుకున్నారు.హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బంగారాన్ని తరలిస్తున్నామని అజయ్, ప్రకాష్ అనే వ్యక్తులు పోలీసు విచారణలో వెల్లడించారు. 7 కిలోల బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. రూ 3 కోట్లు విలువైన బంగారంతో పాటు రూ. 10 లక్షల నగదును వారు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం కేసును తాలూకా పోలీసు స్టేషన్​కు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement