Wednesday, May 15, 2024

బీహార్ లో అధికార పార్టీ నేత కాల్చివేత‌..

బీహార్‌లోని కతియార్ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో అధికార పార్టీకి చెందిన నాయకుడిని దుండగులు హత్యచేశారు.. 70 ఏండ్ల కైలాష్‌ మహతో అధికార జేడీయూకి చెందిన సీనియర్‌ నాయకుడు. పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఉన్న ఆయన ఇంటికి బైక్‌పై వచ్చిన వ్యక్తులు ఆయనపై తుపాకీతో కాల్పులకు పాల్పడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆయన మృతిచెందారు. పాత క‌క్ష‌ల వ‌ల్లే లే ఆయనను కాల్చి చంపారని స్థానికులు చెప్పారు. భూమికి సంబంధించిన గొడవల విషయంలో తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కొన్ని రోజుల క్రితం పోలీసులను కోరారని వెల్లడించారు. కాగా, మహతోపై నాలుగు నుంచి ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. కడుపులో, తలపై తీవ్రంగా గాయపడటంతో ఆయన మృతిచెందారని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement