Tuesday, May 7, 2024

Jammu & Kashmir లో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రదాడి – అమరులైన ముగ్గురు జవాన్లు

జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఇవాళ ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై జరిగిన రెండో ఉగ్రదాడి ఇది.ఈ దాడిలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు.

మరో ముగ్గురు గాయపడ్డారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. పూంచ్‌లోని సురన్‌కోట్ ప్రాంతంలో ఆర్మీ ట్రక్‌పై మెరుపుదాడి జరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆకస్మిక దాడి జరిగిన ప్రాంతానికి ఆర్మీ బలగాలను తరలించారు.ప్రస్తుతం కాల్పులు జరుగుతున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement