Thursday, April 25, 2024

Jaggi Vasudev | వేగంగా కోలుకుంటున్న సద్గురు.. వీడియో షేర్ చేసిన ఆయన కుమార్తె

ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ మెదడులో బ్లీడింగ్ కారణంగా అత్యవసర బ్రెయిన్ సర్జరీ కోసం న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అయితే ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. జగ్గీ వాసుదేవ్ తన ఆసుపత్రి గదిలో బెడ్ మీద కూర్చుని వార్తాపత్రిక చదువుతున్న వీడియోను ఆయ‌న‌ కుమార్తె (సోమవారం) సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సద్గురు త్వరగా కోలుకుంటున్నారని.. జగ్గీ వాసుదేవ్ ఆరోగ్య పరిస్థితిని ఆమె తెలియజేశారు. ఆ వీడియోలో సద్గురు తలపై బ్యాండేజ్ ప్యాచ్ కనిపించింది. సద్గురు ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్న సద్గురు అభిమానులు, శిష్యులు కూడా సద్గురు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వీడియోకింద కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement