Thursday, March 28, 2024

Breaking: శాశ్వత అధ్యక్ష పదవి ప్రతిపాదనను జగన్ తిరస్కరించారు.. సజ్జల

వైసీపీ శాశ్వత అధ్యక్ష పదవి ప్రతిపాదనను సీఎం జగన్ తిరస్కరించారని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… తమ ప్రతిపాదనను సీఎం జగన్ అంగీకరించలేదన్నారు. మళ్లీ ఐదేళ్లకు పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి చెబుతామన్నారు.

వైసీపీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌ ఎంపికైనట్లు వచ్చిన వార్తలపై సీఈసీ స్పందించింది. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదని తెలిపింది. ఏ పార్టీలోనూ శాశ్వత పదవులు ఉండకూడదని ఎన్నికల సంఘం పేర్కొంది. ఏ పార్టీకి అయినా తరచూ ఎన్నికలు జరగాలని.. శాశ్వత అధ్యక్షుడు లేదా శాశ్వత పదవులు.. ప్రజాస్వామ్యానికి విరుద్దమని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. దీనిపై సజ్జల స్పందించి.. పై విధంగా తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement