Thursday, April 25, 2024

చెన్నైపగ్గాలు ధోనీకే.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న జడేజా!

ఈ ఐపీఎల్‌లో పూర్ ఫామ్‌లో ఉన్న జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో లీగ్‌ను ఆరంభించిన చెన్నై.. వరుస ఓటములతో అవమానాలు మూటగట్టుకుంది. లీగ్ ప్రారంభానికి మందే జట్టు కెప్టెన్సీని జడేజాకు ఇస్తున్నట్లు ధోనీ ప్రకటించాడు. అయితే జడేజా కెప్టెన్సీలో జట్టు ఘోరమైన ప్రదర్శన కనబరిచింది. ఇటీవల కొన్ని విజయాలు నమోదు చేసిన చెన్నై.. సులభమైన మ్యాచుల్లో కూడా ఓటమి చవి చూస్తూ వస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ జడేజా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండిట్లోనూ విఫలమవుతూ వస్తున్నాడు.

ఈ క్రమంలో జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొని, తన ఆటపై ఫోకస్ పెట్టాలని జడ్డూ నిర్ణయించుకున్నాడట. అందుకోసం మళ్లీ కెప్టెన్సీని ధోనీకి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు. ధోనీ కూడా దీనికి అంగీకరించడంతో చెన్నై సారధిగా మళ్లీ ధోనీ కనిపించనున్నాడు. ఈ వార్తపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరీ కెప్టెన్సీ మారిన తర్వాత చెన్నై మరోసారి మునుపటి ఫామ్ అందుకుంటుందేమో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement