Monday, April 29, 2024

ఉద్యోగులకు సమస్యలున్నమాట వాస్తవమే : సజ్జల

కడప బ్యూరో : గతంలో ఎప్పుడూ లేనంతగా ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మేలు చేశారు .ఉద్యోగుల సమస్యలు వీలైనంత వరకు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాము. అయినా ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి అన్నారు. కడపలో అయన ఎన్జీఓ అపార్టుమెంట్ ను ప్రారంబించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ. కరోనా మహమ్మారి వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని, రెవెన్యూ లేకపోవడం వల్ల ఉద్యోగులు సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. ఉద్యోగస్తులు పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగమని,ఉద్యోగులను ఎప్పుడూ రాజకీయాలకు వాడుకోలేదని పేర్కొన్నారు. ఉద్యోగులకు గ్రూపులుగా విభజించి రాజకీయాలు చేసే అవసరం లేదన్నారు. 10 సంవత్సరాలు ప్రజల్లోనే ఉండి సమస్యలు తెలుసుకున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డని, భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగుల కలలను సాకారం చేస్తామని బరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement