Saturday, July 27, 2024

కార్తికేయ 2 టీమ్‌కి ఇస్కాన్ ఆహ్వానం.. ట్వీట్ చేసిన హీరో

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో గతంలో వచ్చిన కార్తికేయ సినిమా మంచి విజయం సాధించింది. ఎనిమిదేళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ గా కార్తికేయ 2 రాబోతుంది. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కార్తికేయ 2 సినిమాని తెరకెక్కించారు. ఈ సారి సినిమాని మరింత కొత్త కథతో, మరింత సస్పెన్స్ గా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. కృష్ణుడు, ద్వారకకి సంబంధించిన కథతో, దేని కోసమో హీరో వెతుకుతూ ప్రయాణం మొదలు పెట్టినట్టు ట్రైలర్ చూపించారు. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని అర్థమైపోయింది. ట్రైలర్ తో సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు. ఈ సినిమాని పాన్ ఇండియాగా రిలీజ్ చేయబోతున్నారు.

తాజాగా ఈ సినిమా టీంకి ఇస్కాన్ హెడ్ ఆఫీస్ నుంచి స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి నిఖిల్ ఓ వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో నిఖిల్ మాట్లాడుతూ.. కార్తికేయ టీంకి మధుర బృందావన్ ఇస్కాన్ హెడ్ ఆఫీస్ నుంచి స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది. మన సినిమా కాన్సెప్ట్, టీజర్ చూసి కృష్ణుడికి సంబంధించి ఉండటంతో అక్కడికి వచ్చి భక్తులతో మాట్లాడమన్నారు. సినిమా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇది నిజంగా చాలా సంతోషమైన విషయం. రేపు అక్కడే సినిమాకి సంబంధించి ఇంకో టీజర్ రిలీజ్ చేస్తాము. అలాగే సినిమా కొత్త డేట్ ని ప్రకటిస్తాము” అని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement