Saturday, June 1, 2024

Last Rites – ముగిసిన ఇరాన్ అధ్యక్షుడి అంత్యక్రియలు

హాజరైన హమాస్, హౌతీ, తాలిబాన్ లీడర్స్..
భార‌త్ త‌రుపున ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్ క‌ర్ హాజ‌రు

హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ బౌతిక‌కాయానికి పూర్తి అధికార లాంచ‌నాల‌తో నేడు టెహ‌రాన్ లో అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. ఇరాన్ వ్యాప్తంగా వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారత్ తరుపును దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ కూడా హాజరై రైసీకి నివాళులు అర్పించారు. ఇరాన్ తాత్కాలిక అధ్యక్షడు మహ్మద్ ముఖ్‌బన్‌ని కలుసుకుని సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -

ఇదిలా ఉంటే రైసీ అంత్యక్రియలకు హమాస్, హౌతీ, హిజ్బుల్లా మిటిటెంట్ సంస్థల లీడర్లతో పాటు తాలిబాన్ లీడర్లు హాజరయ్యారు. టెహ్రాన్‌లో జరిగిన ఈ అంత్యక్రియాలకు తాలిబాన్ ఉప ప్రధాని ముల్లా బరాదర్, హమాస్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ హనియే, ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ మిలిటెంట్ గ్రూప్ ప్రతినిధులు హాజరయ్యారు. వేలాదిగా ఇరాన్ ప్రజలు హాజరైన ప్రార్థనలకు ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నాయకత్వం వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement