Friday, May 3, 2024

28న ఇంటర్‌ ఫలితాలు.. ఉదయం 11 గంటలకు రిలీజ్​ చేస్తామన్న మంత్రి సబిత

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రేపు (ఈనెల 28న) ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఇంటర్‌ బోర్డు ప్రకటించనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈమేరకు ఫలితాలను విడుదల చేయబోతున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఫలితాల విషయంలో ఎలాంటి రూమర్స్‌ను నమ్మకూడదని విద్యార్థులు, తల్లిదండ్రులను ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంటర్‌ పరీక్షలకు ఈసారి దాదాపు 9 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement