Monday, April 29, 2024

ఎల్​ఓసీ వెంబడి పాక్​ ఉగ్రవాదుల చొరబాటు.. ప్రయత్నాలను భగ్నం చేసిన సైన్యం

జమ్ము, కాశ్మీర్​లోని రాజౌరి జిల్లా నౌషేరా సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్​ ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించారు. కాగా, ఈ చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్ భగ్నం చేసింది. ఉగ్రవాదుల్లో ఒకరి మృతదేహం, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ పురోగతిలో ఉంది” అని జమ్మూలో PRO తెలిపారు. ఇదిలా ఉండగా జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని మైసుమా బ్రిడ్జి సమీపంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు సోమవారం కాల్పులు జరపడంతో ఇద్దరు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్లు గాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement