Tuesday, April 30, 2024

Indonesia Open – సింధూకి మ‌రో ఓట‌మి ..ల‌క్ష్య‌సేన్ పై కిదాంబి విజ‌యం

ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 నుంచి పీవీ సింధు నిష్క్రమించింది. కిదాంబి శ్రీకాంత్, ప్ర‌ణ‌య్ లు రెండో రౌండ్ లో గెలిచి క్వార్ట‌ర్ ఫైన‌ల్ లో అడుగుపెట్టారు. కాగా భారత ప్లేయర్ల మధ్య జరిగిన మ్యాచ్ లో యువ కెరటం లక్ష్యసేన్​పై సీనియర్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో తైపీకి చెందిన తాయ్ ట్జు యింగ్ చేతిలో 21-18 21-16 తేడాతో పి వి సింధూ పరాజయాన్ని ఎదుర్కొంది. సింధు గత రెండు ఈవెంట్‌ల నుంచి కూడా ఓపెనింగ్ రౌండ్‌లోనే నిష్క్రమించింది. ఇటీవలే జరిగిన 2023 సుదీర్‌మాన్ కప్‌లోనూ సింధు- తాయ్ ట్జు పోటీపడ్డారు. ఆ మ్యాచ్​లోనూ సింధుపై 21-14 18-21 21-17 తేడాతో తాయ్​ గెలుపొందింది.

ఇక ఇదే ఈవెంట్​లో జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్.. భారత్​కే చెందిన యువ సంచలనం లక్ష్యసేన్​పై 21-17 22-20 తేడాతో విజయం సాధించాడు. దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో శ్రీకాంత్.. 21-17 22-20 తేడాతో సేన్​ను ఓడించాడు.

శ్రీకాంత్​ కంటే ముందు ఈ గేమ్​లో లక్ష్య సేన్​ దూసుకెళ్లాడు. నువ్వా-నేనా అంటూ ఆడుతూ శ్రీ కాంత్​పై 4-0 ఆధిక్యాన్ని సాధించాడు. అలా 17 పాయింట్ల వరకు తన ఆధిక్యాన్ని కొనసాగించాడు. ఇక ఆట వేగం పుంజుకుంటుదన్న తరుణంలో సీనియర్​ ప్లేయర్​ శ్రీ కాంత్​ విజృంభించి గేమ్​ను ఇంకా ఆసక్తికరంగా మార్చాడు. వరుసగా నాలుగు పాయింట్లు తన ఖాతాలో వేసుకుని తొలి గేమ్ ని కైవ‌సం చేసుకున్నాడు..

- Advertisement -

ఇక రెండో రౌండ్​ కూడా ఇంచుమించు మొదటి గేమ్​ లాగే సాగింది. అప్పటి వరకు 14 పాయింట్లతో ఇద్దరూ ఒకే జోరులో ఉన్న తరుణంలో ఆరు స్ట్రెయిట్​ పాయింట్లు స్కోర్​ చేసిన శ్రీ కాంత్​.. 20-14 తేడాతో సేన్​పై ఆధిక్యాన్ని చూపించాడు. కానీ సేన్​ కూడా వెనువెంటనే 20 పాయింట్లు సాధించడం వల్ల ఇద్దరి వద్ద సమమైన పాయింట్స్​ ఉన్నాయి. ఇక విజయం ఎవరిది అన్న ఉత్కంఠతో జరిగిన రౌండ్​లో శ్రీ కాంత్..​ మరో రెండు పాయింట్లు సాధించి లక్ష్య సేన్​ను వెనెక్కి నెట్టి టోర్నీలో క్వార్ట‌ర్స్ లోకి అడుగు పెట్టాడు.. మ‌రో మ్యాచ్ లో ప్ర‌ణ‌య్ 21 -18, 21 -16 లో ఆంగ‌స్ పై విజ‌యం సాధించి క్వార్ట‌ర్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement